దంతాలపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి పై గ్యాస్
మొద్దు పెట్టీ ధరల పెరుగుదలపై రాస్తారోకో
By Ram Reddy
On
లోకల్ గైడ్ జిల్లా ప్రతినిధి మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో
నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
బిజెపి ప్రభుత్వ విధాన వైఫల్యాల వల్ల గ్యాస్ ధరలు పెరిగి తీవ్ర కొరత ఏర్పడ్డదని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి ఆరోపించారు
దంతాలపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి పై గ్యాస్ మొద్దు పెట్టీ ధరల పెరుగుదలపై రాస్తారోకో నిర్వహించి ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ నియంతగా వ్యవహరిస్తూ తన ఆధిపత్యాన్ని చలాయించడం కోసం ప్రభుత్వ అధినేతలను ఎత్తుకెళ్లి నిర్బంధించడం, ఇరాన్ పై ఇజ్రాయిల్ తో కలిసి ఏకపక్షంగా దాడులు నిర్వహిoచి ప్రపంచ సంక్షోభావానికి కారణమవుతున్న నరేంద్ర మోడీ అమెరికాను పల్లెత్తు మాట అనకుండా, ఎవరి ఎవరి వద్ద చమరుకొనాలో ట్రంప్ పర్మిషన్ తీసుకోవలసిన రావడం అమెరికాకు దాసోహమై ,దేశ సార్వభౌమత్వాన్ని మంటగలిపారని, గ్యాస్ ధర ఒకేసారి 60 రూపాయలు పెంచడం, గ్యాస్ బండల తీవ్ర కొరత ఏర్పడడంతో హోటల్స్, హాస్టల్స్ మూత వేసుకునే పరిస్థితి దాపురించి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గరవుతున్నారనీ ,దీనికి పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ బాధ్యతారహితమైన విధానాలేనని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్ పోలేపాక వెంకన్న, మురళి శేఖర్ జలంధర్, వీరన్న సైదులు, చంద్రు, వేణు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Latest News
24 Mar 2026 18:28:52
నిర్మల్ : లోకల్ గైడ్ :ప్రపంచ నీటి దినోత్సవం- సందర్భంగా వాటర్ అండ్ జెండర్ నేపద్యము తో మామడ మండలము లోని బండల్ ఖానాపూర్ గ్రామంలో
