పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
By Ram Reddy
On
సిద్ధిపేట జిల్లా ప్రతినిధి మార్చి14:(లోకల్ గైడ్ తెలంగాణ)
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలలో జరుగుతున్న ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఎస్ఎస్సి–2026 బోర్డు మార్గదర్శకాల ప్రకారం పరీక్షలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా విధులు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు.
పరీక్ష గదుల్లో ఎలాంటి పుస్తకాలు, చార్ట్లు లేదా ఇతర సమాచార పత్రాలు ఉండకూడదని, ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు అనుమతించరాదని, పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే విద్యార్థులను లోపలికి అనుమతించాలని తెలిపారు.అదేవిధంగా పరీక్షా కేంద్రం పరిసరాల్లో సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Tags:
About The Author
Latest News
24 Mar 2026 18:28:52
నిర్మల్ : లోకల్ గైడ్ :ప్రపంచ నీటి దినోత్సవం- సందర్భంగా వాటర్ అండ్ జెండర్ నేపద్యము తో మామడ మండలము లోని బండల్ ఖానాపూర్ గ్రామంలో
