హత్య కేసులో ఇద్దరి నిందితుల అరెస్ట్
నిందితులను అరెస్టు చేసినట్లు మంచిర్యాల సిఐ ప్రమోద్ రావు తెలిపారు.
By Ram Reddy
On
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కళాశాల రోడ్డులో యువకుడిని హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు మంచిర్యాల సిఐ ప్రమోద్ రావు తెలిపారు.సిఐ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల19న మంచిర్యాల కాలేజీ రోడ్డులో దీపక్ (35)అనే యువకుడి హత్య కేసులో నిందితులు కాజీపేట మండలం పల్లెంగూడ నివాసి భీమిని సంజీవ్,మహారాష్ట్ర అహేరి నివాసి సీడం దీపక్ లను ఆదివారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల సిఐ తెలిపారు.నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకొని నిందితులను మంచిర్యాల కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి నిందితులకు14రోజుల రిమాండ్ విధించగా,వారిని లక్షేట్ పేట సబ్ జైలుకు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు.
Tags:
About The Author
Latest News
02 Apr 2026 19:45:14
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా
కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
