పఠాన్ చేరు రైతులకు ఊతం..టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్

-వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు పై కృతజ్ఞతలు

పఠాన్ చేరు రైతులకు ఊతం..టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్

మహేష్ కుమార్ గౌడ్‌ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ

 పఠాన్ చేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పఠాన్ చేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా ఏర్పాటు చేయడం, చైర్మన్‌గా శివానందం నియమితులై నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతులకు మేలు చేస్తుందని, స్థానిక వ్యవసాయ రంగానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా  కాట శ్రీనివాస్ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ ని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. పఠాన్ చేరు ప్రాంత అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. పఠాన్ చేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు స్థానిక రైతులకు ఒక కీలక ముందడు గుగా భావించవచ్చు. మార్కెట్ సదుపాయాలు మెరుగు పడటంతో రైతులకు సరైన ధరలు లభించే అవకాశాలు పెరుగుతాయి. అలాగే, స్థానిక నాయకత్వం, పార్టీ మధ్య సమన్వయం బలపడటం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావచ్చు.

Tags:

About The Author

Latest News

విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
    వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన