కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కుటుంబ సమేతంగా సందర్శించారు. 

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 ఖమ్మం: లోకల్ గైడ్
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో కొలువైన శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి  కుటుంబ సమేతంగా సందర్శించారు. 

స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం పండితుల వేదాశీర్వచనాలను, తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అధికారులు మంత్రి IMG-20260304-WA0121  వరసిద్ధి వినాయక స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కృపాకటాక్షాలతో ప్రజలంతా ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లాలని కోరుకున్నారు.

Tags:

About The Author

Latest News