మాజీ సర్పంచ్ చలపతి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ పారిశుద్ధ్య పనులు

మాజీ సర్పంచ్ చలపతి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ పారిశుద్ధ్య పనులు

 

చర్ల : లోకల్ గైడ్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పులిగుండాల గ్రామపంచాయతీలో 99వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామంలోని 6వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ సోడి చలపతి ఆధ్వర్యంలో జరిగింది.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాన్ని శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో గ్రామపంచాయతీ సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది మర్మం కృష్ణ, సరేశ్వరరావు, మడకం లక్ష్మణ్, శ్రీను, చిన్నబాబు, నాగరాజు, గంగరాజు తదితరులు పాల్గొని శుభ్రత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.

Tags:

About The Author

Latest News