వ్యవసాయ కూలీల హక్కుల కోసం పోరాడుదాం
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
By Ram Reddy
On
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 6 :
శుక్రవారం రోజు అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకే ఎంఎస్ ఖమ్మం డివిజన్ ప్రధమ మహాసభ కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామంలో అమరుడు లక్ష్మీనరసు నగర్ లో కూరాకుల నరసయ్య అధ్యక్షతన జరిగింది.
మా సభకు ముందుగా డివిజన్ అధ్యక్షులు కూరాకుల నరసయ్య జండా ఆవిష్కరించారు. ఈ మహాసభకు ప్రారంభ ఉపన్యాసకులుగా గుమ్మడి నరసయ్య పాల్గొని మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా అనేక చట్టాలను మార్చి కొత్తవి చేసి ప్రజలను పీడిస్తుందని. యాట రెండు కోట్ల ఉద్యోగాల మాట అటకెక్కిందని, నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఖాతాలో వేస్తామని ప్రజలను దగా చేసిన ప్రధానిగా మోడీ నిలిచారని , నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్న పట్టించుకున్న పాపాన పోలేదని. భారతదేశం వెలుగు పోతుందని తెగ ప్రచారం చేసుకుంటున్నా భారత పాలకులు ఆకలి సూచికల్లో 127 దేశాల్లో 105వ స్థానంలో ఉన్నదని అంటే మన పరిస్థితి ఏంటో అర్థం అవుతుందని గుమ్మడి నరసయ్య అన్నారు.
ఈ మహాసభలో కార్యదర్శి కే లో పాపారావు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. వివిధ కారణాలతో రైతాంగ. కార్మిక పోరాటాలలో అమృతం పొందిన అమరవీరులకు సంతాపం తెలియజేశారు.
మహాసభలో ఖమ్మం డివిజన్ అధ్యక్షునిగా కూరాకుల నరసయ్య. ఉపాధ్యక్షులుగా చల్ల రాజు. ప్రధాన కార్యదర్శిగా కే లోతు పాపారావు. సహాయ కార్యదర్శిగా కోడెం సీతారాములు. కోశాధికారిగా ఎస్.కె హుస్సేన్ బి తో పాటు 16 మందిని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.
మహాసభ కొత్తగా తెచ్చిన విబిజి రాంజీ పథకాన్ని రద్దుచేసి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని.
200 రోజులు పని దినాలు కల్పించాలని.
ఎలాంటి షరతులు లేకుండా రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని. 12 వేల రూపాయల జీవన భృతి వెంటనే ఇవ్వాలని మహాసభ తీర్మానించనైనది. మార్చి 24, 25 తేదీలలో కామారెడ్డిలో ఏ ఐ పీ కే ఎం ఎస్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సభ అభిప్రాయపడింది.
ఈ కార్యక్రమంలో ఏ ఐ పీ కే ఎం ఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బందెల వెంకయ్య, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు, సి పి ఎం ఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ, టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ , ఏ ఐ పీ కే ఎంఎస్ నాయకులు చల్ల రాజు , రావుల నాగేశ్వరరావు , మేక రామనాథం , పొట్లపల్లి కృష్ణ , కోడం సీతారాములు, గుమ్మడి ఎర్రయ్య , గుమ్మడి సరోజిని , అనసూర్య , సీత , సమ్మక్క , సత్తిరెడ్డి, సక్రు , రాము , రమణ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
19 Mar 2026 19:54:11
లోకల్ గైడ్/బంట్వారం:
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
