జడ్చర్ల రూరల్ సీఐగా కే.మహేష్ బాధ్యతల స్వీకారం

నాగార్జున గౌడ్ సీసీఎస్‌కు బదిలీ – శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబాటు

జడ్చర్ల రూరల్ సీఐగా కే.మహేష్ బాధ్యతల స్వీకారం



మిడ్జిల్ ఏప్రిల్ 7(లోకల్ గైడ్ ):

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా కే.మహేష్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా తన సేవా వివరాలు, గత అనుభవాలను జిల్లా ఎస్పీ గారికి వివరించారు.
ఇంతకుముందు జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన నాగార్జున గౌడ్ గారిని పరిపాలనా కారణాలతో మహబూబ్‌నగర్ సీసీఎస్ (Crime and Criminal Tracking System) విభాగానికి బదిలీ చేయడం జరిగినది. ఆయన సేవలను అధికారులు ప్రశంసిస్తూ, కొత్త బాధ్యతల్లో కూడా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
కే.మహేష్ గారు 2012 బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సబ్ ఇన్స్పెక్టర్గా సేవలు అందించి ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారు. 2023 సంవత్సరంలో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన అనంతరం సూర్యాపేట ఎస్‌బీఐ మరియు కొల్లాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించి విశేష అనుభవాన్ని సంపాదించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం వంటి అంశాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు కే.మహేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జడ్చర్ల రూరల్ పరిధిలో శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించాలని, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను వేగంగా పరిష్కరించాలని, పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచే విధంగా సేవలు అందించాలని సూచనలు చేశారు.
కే.మహేష్ గారు మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జడ్చర్ల రూరల్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడం, నేరాలను అరికట్టడం, యువతను చట్ట విరుద్ధ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Tags:

About The Author

Latest News

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్ 07  లోకల్ గైడ్  వరంగల్,రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ...
భూసేకరణ పరిహారం పై తెర 
వసతి గృహాల్లో వంద శాతం ప్రవేశాలు కల్పించాలి.
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కొయ్యూరు పీహెచ్‌సీలో అవగాహన ర్యాలీ
ప్రజలకు నాణ్యమైన సేవలందించిన వైద్య సిబ్బందికి గౌరవం ప్రతిభకు పురస్కారాలు
ప్రమాదవశాత్తు చెరువులో పడి  విద్యార్థి మృతి....
జడ్చర్ల రూరల్ సీఐగా కే.మహేష్ బాధ్యతల స్వీకారం