వసతి గృహాల్లో వంద శాతం ప్రవేశాలు కల్పించాలి.

రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ ఆదేశం

వసతి గృహాల్లో వంద శాతం ప్రవేశాలు కల్పించాలి.

నిర్మల్ జిల్లా ప్రతినిధి.
ఏప్రిల్ 7 (లోకల్ గైడ్):

జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల ప్రభుత్వ వసతి గృహాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ వంద శాతం ప్రవేశాలు కల్పించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ సి. శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలో పర్యటించి పలు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఇచ్చోడ, బజార్‌హత్నూర్ ప్రాంతాల్లోని ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలతో పాటు ఆదిలాబాద్‌లోని కళాశాల బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని రికార్డులను, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు. వసతి గృహాల్లో అందుతున్న భోజన సదుపాయాలు, ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన లోపాలను తక్షణమే సవరించాలని అధికారులకు సూచించారు.

అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వసతి గృహ సంక్షేమ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. వసతి గృహాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి, విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి నెలా విద్యార్థులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించేలా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతి రెండు నెలలకోసారి సమావేశం నిర్వహించి నాణ్యమైన ఆహారం అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ల సంఖ్యను పెంచాలని, వివిధ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి వివరాలను ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్ష, ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, మ్యాన్యువల్ స్కావెంజర్స్ కమిటీ సమావేశాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి విధిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సునీత, ASWOలు నారాయణ రెడ్డి, నర్సింగ్, వసతి గృహ సంక్షేమ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్ 07  లోకల్ గైడ్  వరంగల్,రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ...
భూసేకరణ పరిహారం పై తెర 
వసతి గృహాల్లో వంద శాతం ప్రవేశాలు కల్పించాలి.
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కొయ్యూరు పీహెచ్‌సీలో అవగాహన ర్యాలీ
ప్రజలకు నాణ్యమైన సేవలందించిన వైద్య సిబ్బందికి గౌరవం ప్రతిభకు పురస్కారాలు
ప్రమాదవశాత్తు చెరువులో పడి  విద్యార్థి మృతి....
జడ్చర్ల రూరల్ సీఐగా కే.మహేష్ బాధ్యతల స్వీకారం