పీఎం శ్రీ పాఠశాలల పథకాల అమలులో ఖమ్మం జిల్లాను అగ్రస్థానంలో నిలపండి.

జిల్లా విద్యాశాఖ అధికారి

పీఎం శ్రీ పాఠశాలల పథకాల అమలులో ఖమ్మం జిల్లాను అగ్రస్థానంలో నిలపండి.

చైతన్య జైని

ఖమ్మం :లోకల్ గైడ్ :

పి.ఎం శ్రీ పాఠశాలల పని విధానము, పీఎం శ్రీ పథకాల అమలులో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా కు ఒక ప్రత్యేక స్థానము ఉందని, దీనిని నిలుపుకుంటూ ఖమ్మం జిల్లాలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవాలని కోరారు. *మంగళవారం ఖమ్మం నూతన కలెక్టరేట్ భవనంలోని ప్రజ్ఞ సమావేశం మందిరంలో జిల్లాలోని 28 పీఎం   పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్స్ తో జరిగిన సమీక్షా సమావేశం ఆమె మాట్లాడారు.* అధ్యక్షత వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి  చైతన్యజైని మాట్లాడుతూ 
ఈ పీఎం శ్రీ పాఠశాలలకు వివిధ పథకాల కింద వచ్చిన నిధులను సద్వినియోగపరుచుకుంటూ విద్యార్థినీ విద్యార్థులను మరింత ప్రతిభావంతంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యక్తిగతంగా వారి వారి పాఠశాలలో పీఎం శ్రీ పథకాలఅమలు గురించి మరియు వాటిలో విద్యార్థుల భాగస్వామ్యం గురించి వివరంగా విశ్లేషణాత్మకంగా వివరించారు.
 డీఈఓ  చైతన్యజైని    మాట్లాడుతూ
. ఎన్ ఈ టి -2020 లక్ష్యాలకు అనుగుణంగా
. విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వాన్ని పెంచే విధంగా
. విద్యార్థులను ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దేందుకు
 లీడర్షిప్ మరియు ఇంక్లూజిటివిటి ని పెంచేందుకు
 21వ శతాబ్దం సామర్థ్యాలను విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా
సమాజానికి విద్యార్థులు తమ వంతు కాంట్రిబ్యూషన్ అందించే విధంగా మరియు
 భిన్నమైన మరియు వినూత్నమైన బోధన అభ్యసన ప్రక్రియలు అందిస్తూ ఈ పీఎంశ్రీ  పథకాలను విద్యార్థులలోకి తీసుకెళ్లాలని కోరారు

 *ఈ సమావేశంలో* ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి మరియు  నాగేశ్వరరావు, మల్లికార్జున్, పి ఎం శ్రీ పాఠశాలల ప్రిన్సిపల్స్ ప్రధానోపాధ్యాయులు, వీరస్వామి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, సునీత, శాంతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News