శ్రీ జమ్ములమ్మ దేవాలాయ తలుపులకు వెండి తొడుగులు.
By Ram Reddy
On
జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాలకు దాతల సహకారంతో తలుపులకు వెండి, ఇత్తడి తో తయారు చేసిన తొడుగులను అలంకరించినట్లు దేవాలయం కార్యనిర్వాణాధికారి పురందర్ కుమార్ తెలిపారు. శ్రీ జమ్ములమ్మ గర్భగుడి తలుపులకు వెండితో తయారుచేసిన తొడుగు, అమ్మవారి అంతరాలయం, శ్రీ పరుశురామ స్వామి దేవాలయ తలుపులకు ఇత్తడితో తయారుచేసిన తొడుగులను అమర్చినట్లు ఆయన తెలిపారు. వెండి, ఇత్తడి తలుపులతో శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నవని చెప్పారు. వెండి తొడుగు తలుపులతో అమ్మవారి గర్భాలయం మరింత వెలిగిపోతుండంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
Tags:
About The Author
Latest News
14 Feb 2026 20:05:53
టీడబ్ల్యూజేఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షులు అంబటి స్వామి డిమాండ్. 17నఛలో సమాచార భవన్"కు పిలుపు.
