మిర్యాలగూడ ఫిబ్రవరి 7
( లోకల్ గైడ్,తెలంగాణ)
మిర్యాలగూడ టౌన్ న వ తెలంగాణ.ఈనెల 11వ తేదీన మిర్రాడు మున్సిపాలిటీకి జరగనున్న ఎన్నికల్లో ప్రజల పక్షాన పోరాడి విజయాలు సాధించిన మధులతను గెలిపించాలని ఐద్వా జాతీయ నాయకురాలు మల్లు లక్ష్మి కోరారు. శనివారం నాడు స్థానిక 17వ వార్డులో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి మధులత గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు. ప్రచారంలో మహిళల నుండి మంచి స్పందన కనిపించింది. వార్డులో గతంలో కూడా సిపిఎం కౌన్సిలర్ స్వర్గీయ రామిరెడ్డి కౌన్సిలర్ గా గెలిచిన సమయంలో అభివృద్ధి జరిగిందని ప్రజా సమస్యల పట్ల సిపిఎంకు అలాంటి నిబద్ధత ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో మహిళా సమస్యలు చాలా ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో పాలకవర్గం విఫలమైందని తెలిపారు. పట్టణంలో రైల్వే సమస్య మురికి నీటి సమస్య పేదలకు ఇవ్వాల్సిన రేషన్ కార్డులు ఇవ్వడంలో పాలకవర్గం విఫలమైందన్నారు. 17వ వార్డు నుండి పోటీ చేస్తున్న మహిళతో పోరాట కుటుంబం నుండి వచ్చిందని తమ కుటుంబాల్లో మల్లు స్వరాజ్యం వెంకట నరసింహారెడ్డి మొదటి నుండి ప్రజల కొరకే పాటు పడుతున్నారని అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మధులత కూడా ఎన్నికల్లో గెలిస్తే ప్రజా సమస్యలే ఎజెండాగా పరిష్కార దిశగా పనిచేస్తుందని ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వారి వెంట మహిళా సంఘం నాయకురాలు ప్రభావతి వరలక్ష్మి గోవర్ధన తదితరులు పాల్గొన్నారు.