గుమ్మడిదల నూతన మున్సిపల్ కమిషనర్ కు సన్మానం
By Ram Reddy
On
-మాజీ సర్పంచ్..చిమ్ముల నరసింహ రెడ్డి
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): గుమ్మడిదల మున్సిపల్ నూతన కమిషనర్గా దశరథ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, గుమ్మడిదల తాజా మాజీ సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ దశరథను శాలువాతో సత్కరించి, హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ దశరథ మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, స్థానికుల సహకారం ఎంతో అవసరమని, అందరి సహకారంతో మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మాజీ ఉప సర్పంచ్ మొగులయ్య, కొండల్ రెడ్డి, సత్యనారాయణ, మహిపాల్ రెడ్డి, నర్సింలు, మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts

Latest News
11 Jul 2025 19:59:17
సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావ్...