బోయవాడ ఆదర్శ పోలింగ్ కేంద్రాలను పర్యవేశించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.
ఫిబ్రవరి 11 .(లోకల్ గైడ్ ) నల్లగొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ సాగుతుంది.
నల్లగొండ పట్టణం బోయవాడ లోని ఆదర్శ పోలింగ్ కేంద్రం ను పర్యవేక్షించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ పర్యవేక్షించినారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయా సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.పోలింగ్ కేంద్రాల పరిధిలో 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సెక్షన్ ) అమలు లో ఉంది.పోలింగ్ కేంద్రాల పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుంపులుగా గుమికూడరాదు అన్నారు .పోలింగ్ నిర్వహణకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అన్నారు.సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలలో వద్ద రిజర్వ్ పోలీస్, సివిల్ పోలీసులు, స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రత్యేక దళాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్, డ్రోన్ కెమెరాలు,వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది అన్నారు .ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రత్యేక పోలీస్ నిఘా కొనసాగుతుంది అన్నారు.ఓటర్లను ప్రభావితం లేదా బెదిరింపులకు గురి చేస్తే డయల్ 100 కు సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
