ఈనెల 9న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి.
నల్లగొండలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 9వ తారీఖున కలెక్టరేట్ ముందు ధర్నా గురించి కరపత్రం ఆవిష్కరించడం జరిగింది అట్లాగే మార్చి 30 తారీఖున ఇందిరాపార్క్ దగ్గర జరిగే నిరాహార దీక్షలు విజయంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆదేశాల మేరకు రాష్ట్రప్రధాన కార్యదర్శి కుడుతాల నాగయ్య మాదిగ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడి నరసింహ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు .జిల్లా అధికార ప్రతినిధి ఎర్రోళ్ల శ్రీనివాసు మాదిగ .ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా నాయకులు వంగూరి యాదగిరి . ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు వంగూరి సునీల్ కుమార్ .కార్మిక విభాగం జిల్లా నాయకులు కుడుతాల సైదులు. రంగనాయకులు .స్వామి. వెంకన్న .తదితరులు పాల్గొన్నారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో లాగా ఎస్సీ ఉప కులాల్లో ఉన్న 59 కులాలకు లోన్లు మంజూరు చేయాలని. దళితుల వద్దనుండి లాక్కున్న అసైన్డ్ భూములను తిరిగి దళితులకు ఇవ్వాలి .పారిశుద్ధ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగుల గుర్తించి కనీస వేతనం 20,000 ఇవ్వాలి .లీడ్ క్యాప్ పునరుద్ధరణ చేయాలి .తోళ్ల పరిశ్రమలకు 10000 కోట్లు కేటాయించి చైర్మన్ నియమించి తోళ్ల పరిశ్రమలు ఏర్పాటు చేసి మాదిగ యువతకు ఉపాధి కల్పించాలి. కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25%ఉచిత విద్యలు కచ్చితంగా అమలు చేయాలి. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమిని సాగుభూమి కేటాయించాలి. జీవో నెంబర్ 58 59 ప్రకారం పట్టాలి ఇచ్చి అమ్ముకునే హక్కుకల్పించాలి .అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికుడుతాల నాగయ్య మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి దళితుల్లో ఉన్న 59 ఉప కులాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
