ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా సాధారణ పసవాలను పెంచాలి.
నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ .
నల్లగొండ ఉమ్మడి ప్రతినిధి .ఫిబ్రవరి 17 ( లోకల్ గైడ్).
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా సాధారణ ప్రసవాలను పెంచాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
మంగళవారం ఆయన నల్గొండ జిల్లా, కనగల్ మండలం, పర్వతగిరి ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆరోగ్య ఉప కేంద్రంలోని రిజిస్టర్లను, మందుల స్టాక్, స్టోర్, మరుగుదొడ్లు, పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో అన్ని రికార్డులను సరిగా నిర్వహించాలని, మందుల స్టాక్ రిజిస్టర్ ను అప్డేట్ చేయాలని, గర్భిణీ స్త్రీలకు ప్రతినెల నిర్వహించే పరీక్షలను సక్రమంగా నిర్వహించి ప్రసవ సమయానికి ప్రసవం జరిగేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలను పెంచాలని, పేద ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆస్పత్రిలోని మరుగుదొడ్లు తనిఖీ చేశారు. మందుల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించిన సందర్భంగా ఆయా మందుల వివరాలను, వాటి అందుబాటును, అడిగి తెలుసుకున్నారు.
కాగా ఆరోగ్య ఉప కేంద్రం భవనం పై పెచ్చులు ఊగుతూన్నాయని, మరమ్మతులు చేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖఅధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి , డాక్టర్ కృష్ణవేణి,జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,
మెడికల్ అధికారి రామకృష్ణ, ఎం ఎల్ హెచ్ పి ఊర్మిల, ప్రియదర్శిని, ఆశ, ఏఎన్ఎంలు, తదితరులు ఉన్నారు.
