ఫిజిక్స్ వాలా అవగాహన సదస్సు విజయవంతం.

ఆదివారం రోజున హోటల్ హరిత కాకతీయ నందు ఫౌండేషన్, జేఈఈ,  నీట్ పై అవగాహనా

ఫిజిక్స్ వాలా అవగాహన సదస్సు విజయవంతం.

హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి22(లోకల్ గైడ్ 

ఇండియాలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి విద్యాసంస్థ ఫిజిక్స్ వాలా మేనేజ్మెంట్ ఆదివారం రోజున హోటల్ హరిత కాకతీయ నందు ఫౌండేషన్, జేఈఈ,  నీట్ పై అవగాహనా సదస్సు ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఈ సదస్సుకు సుమారు 400 మందికి పైగా విద్యార్థులు, వారి  తల్లిదండ్రులు హాజరు కావడం జరిగింది అన్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సీఈవో అయిన డాక్టర్ ఇరుకుల్ల మునీందర్  మాట్లాడుతూ, 20 రాష్ట్రాలలో 200 బ్రాంచ్ లతో దేశంలోనే అగ్రస్థానం,  విద్యావ్యవస్థ లో కొనసాగుతూ మన హనుమకొండ పట్టణంలో కూడా ఆఫ్లైన్లో  బ్రాంచ్ ని ఏర్పాటు చేయబోతుంది అని తెలుపుటకు సంతోషిస్తున్నాము అన్నారు.బాగా చదువుకొని ఉన్నతమైన స్థితికి ఎదగాలనే కాంక్షతో ఉన్న ఏ విద్యార్థి నైనా సక్సెస్ చేయాలి అనే ఉద్దేశంతో ఫిజిక్స్ వాలా ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఈ ప్రోగ్రాం లో భాగంగా అన్ని క్లాస్ రూములు డిజిటల్ బోర్డ్స్ తో, ఏసీ క్లాస్ రూమ్లను కలిగి, ప్రతి క్లాసులో టీచింగ్ చేసిన లెక్చర్ని రికార్డింగ్ చేసి ప్రతి స్టూడెంట్ కి అదే రోజు పిడబ్ల్యూ ఆప్ లో అప్లోడ్ చేయబడతాయి అన్నారు. 
తద్వారా ఏదైనా టాపిక్ విద్యార్థికి అర్థం కాకపోయినా కన్ఫ్యూజ్ అయిన మర్చిపోయినా రికార్డింగ్ లెక్చర్ని యాప్ లో వినడం ద్వారా పూర్తిగానేర్చుకోగలుగుతాడు అని చెప్పారు. 
అకాడమిక్ డైరెక్టర్  డాక్టర్ ఆనంద్ రామన్  మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా విద్యావ్యవస్థలో ఎన్నో వేల మంది సాధారణ విద్యార్థులను కూడా ఐఐటి నీట్ లలో ఉత్తమ ర్యాంకులు సాధించే విధంగా ప్రోగ్రాం చేసి అది విద్యార్థుల చేత వర్క్ చేయించడం ద్వారా అద్భుత ఫలితాలు సాధింప చేశామని తెలిపారు. 
అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి  మాట్లాడుతూ చారిత్రాత్మక వరంగల్ పట్టణంలో ఫిజిక్స్ వాలా ను ఏర్పాటు చేయటం ఈ ప్రాంత విద్యార్థులకు జాతీయస్థాయిలో చాలా అలవోకగా విజయం సాధించడానికి ఈ సంస్థ తోడ్పడుతుందని తెలిపారు.ఏ విద్యార్థికి అయినా ఇంటర్మీడియట్ దశ చాలా కీలకమని ఈ దశలో రెండు సంవత్సరాలు తమ సమయాన్ని పర్ఫెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చు అని చెప్పారు.8, 9, 10 తరగతుల విద్యార్థుల కొరకు పర్ఫెక్ట్ ఫౌండేషన్ కోచింగ్ తోబాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు సంవత్సరాల ఐఐటి జేఈఈ కోచింగ్ తో పాటు వివిధ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ఐఐటీ నీట్ లో సీట్ రాని విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఇవ్వబడును అన్నారు.
ఈ ప్రోగ్రాం కి హాజరై  విజయవంతం చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు,  కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి