శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
మానవసేవనే మాధవసేవగా భావించి పేదల సేవలో నిరంతరం ముందుండే సమాజ సేవకుడు చిన్న శ్రీశైలం యాదవ్ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ వారి మిత్ర బృందం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కష్టాలలో ఉన్న నిరుపేదలకు అండగా నిలుస్తూ “అన్న అంటే నేను ఉన్నాను” అనే భావంతో సేవలందిస్తున్న శ్రీశైలం యాదవ్ నిజమైన సేవా తత్వానికి ప్రతిరూపమని కొనియాడారు. పేద, ధనిక అనే తేడా లేకుండా తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆతిథ్యం ఇచ్చే ఆయన సేవాభావం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్, శ్రీశైలం యాదవ్ ని సన్మానించి, అష్టైశ్వర్యాలతో ఆయురా రోగ్యాలతో కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో కూడా సమాజ సేవలో మరింత కృషి చేసి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కేసాయన్న ముదిరాజ్, ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, సుభాష్, తదితరులు పాల్గొని శ్రీశైలం యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.