అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్
వికారాబాద్ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన
మర్పల్లి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి
వికారాబాద్ (లోకల్ గైడ్ ప్రతినిధి): మర్పల్లి, మండల ప్రజలకి రాఖి పండగ శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీకాంత్ రెడ్డి మానవ సంబంధాల్లోని పవిత్రమైన సహోదర భావాన్ని బలోపేతంచేసే రక్షా బంధన్ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గ ఆత్మీయ అన్న చెల్లెలకు, అక్క, తమ్ముళ్లకు, ప్రజలకు, ఆత్మీయ సోదర సోదరీమణులకు, ప్రజాప్రతి నిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనాధికారులకు, ఆత్మీయు లకు, శ్రేయభిలాషులకు రక్షా బంధన్ (రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియచేసిన ఈ సందర్భంగా... మర్పల్లి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్కా తమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబందానికి ప్రతీక ఈ రక్షా బందన్ అని అన్నారు. ఈ మంచి అనుబంధాన్ని ఆప్యాయతను పర్వదినాన్ని ఆనందంగా జరుపు కోవలన్నారు. ఈ పండుగను అన్నా చెల్లెళ్లు లేదా అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమాను రాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారని చెప్పారు. అక్క తమ్ముళ్ల, అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని, సోదరుడు, సోదీరిమణుల అనురాగానికి సంకేతమైన ఈ పండుగను కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని, అన్నాతమ్ముండ్లు తమ అక్కా చెల్లెండ్లకు ఎల్ల వేళలా అండగా నిలబడుతారనే భరోసా భావన రాఖీ పండుగ లో ఇమిడి ఉన్నదని తెలియ చేసారు. రక్షాభందన్. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అన్నంటే, అమ్మలో మొదటి సగం నాన్న లో రెండో సగం అన్న చెల్లెల అనురాగానికి గుర్తే రక్షా బంధనం అని రాఖీ పండుగను విజయవంతంగా ఆనందముగా జరుపు కోవాలని తెలియజెసారు.
About The Author
