ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాల స్వాస్థ్య శిబిరం విజయవంతం.

శిబిరం ద్వారా పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన

ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాల స్వాస్థ్య శిబిరం విజయవంతం.

లోకల్ గైడ్ షాద్ నగర్)

ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో  0–10 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం ఫరూక్ నగర్ మండలం కాశిరెడ్డిగూడ మరియు చింతగూడ గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో  నిలోఫర్ ఆసుపత్రి నుండి వచ్చిన బాల వైద్య నిపుణులు డాక్టర్ మునీషా, డాక్టర్ వంశీ, డాక్టర్ రవితేజ పిల్లలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు మరియు సూచనలు అందించారు. ఈ శిబిరం ద్వారా పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రుల్లో అవగాహనIMG-20260207-WA0233 పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ప్రగతి సీనియర్ కోఆర్డినేటర్ ద్యాగ శంకర్  పూర్తిగా పర్యవేక్షిస్తూ, పోషకాహార లోపం నిర్మూలనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువత, గ్రామస్తులు అందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. *“చేయి చేయి కలుపుదాం – పోషకాహార లోపాన్ని నిర్మూలిద్దాం”* అనే నినాదాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కోరారు. అప్పుడే ఆరోగ్యవంతమైన గ్రామాలను నిర్మించగలమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బాల స్వాస్థ్య చీఫ్ కోఆర్డినేటర్ జగదీష్, శ్రుతి, సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ మురళీ కృష్ణ, జీరో మల్న్యూట్రిషన్ కోఆర్డినేటర్ లావణ్య, ప్రగతి, కార్తిక్, శ్రీకాంత్‌తో పాటు ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామస్తులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.

Tags:

About The Author

Latest News

4వ వార్డ్ కౌన్సిలర్‌గా గొల్ల శ్రీశైలం యాదవ్‌ను గెలిపించాలని 4వ వార్డ్ కౌన్సిలర్‌గా గొల్ల శ్రీశైలం యాదవ్‌ను గెలిపించాలని
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): పఠాన్ చేరు మండలం చిట్కుల్ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న మాజీ మండల...
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాల స్వాస్థ్య శిబిరం విజయవంతం.
గెలిపించే బాధ్యత మీది... అభివృద్ధి  బాధ్యత నాది
పదేళ్లలో అప్పుల రాష్ట్రాన్ని మార్చిన కేసిఆర్. అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నం
పుర జోరులో సింగరేణి సర్పంచుల హోరు.
వైరా పురా జోర్లో కారేపల్లి నాయకుల హావ.
ప్రజల సహకారంతో గెలుస్తునాం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి  సాధ్యం.