ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం లాంటివి - బిజెపి

 రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి.

ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం లాంటివి - బిజెపి

 రాజేంద్రనగర్, ( లోకల్ గైడ్ ):

ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం లాంటివని బిజెపి రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం సాయిబాబా నగర్ లో  బిజెపి సీనియర్ నాయకులు సంతు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‌ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డివిజన్లోని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు  ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రావుల భాస్కర్,   మారు మురళి,  ‌ ‌గోపాల్ నాయక్, భూషణ్ ‌, ప్రభుదాస్ , గురుస్వామి,  రంజిత్ సింగ్, భరత్, రమేష్ రెడ్డి,  కురుమూర్తి,  శంకర్ రెడ్డి  స్థానిక యువకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News