15వ వార్డులో బోర్వెల్ కు మరమ్మతులు...
By Ram Reddy
On
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 15వ వార్డులో పాడైపోయిన బోర్వెల్ కు వార్డు కౌన్సిలర్ చింతల వసంత గురువారం మరమ్మతులు చేయించారు.టేకుల బస్తీలోని సులబ్ కాంప్లెక్స్ వద్ద గల బోరవెల్ చెడిపోవడంతో సమస్యను బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కు తెలియజేసి మున్సిపల్ సిబ్బందితో దగ్గర ఉండి కౌన్సిలర్ మరమ్మతులు చేయించారు.అదేవిధంగా వార్డులో ప్రధాన కాలువలు చెత్తతో పేరుకు పోయిన విషయం తెలుసుకున్న ఆమె మున్సిపల్ కమిషనర్ కు తెలియపరచి మున్సిపల్ సిబ్బందితో దగ్గర ఉండి కాలువలు శుభ్రం చేయించారు. మకౌన్సిలర్ గా గెలుపొందిన అతి కొద్ది రోజుల్లోనే ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావిస్తు ప్రతి ఒక్కరికి తానున్నాను అనే భరోసా కల్పిస్తున్న15వ వార్డు కౌన్సిలర్ కు స్థానిక బస్తీ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Tags:
About The Author
Latest News
26 Feb 2026 21:47:26
నారాయణపేట ఫిబ్రవరి 26:
నారాయణపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్ గురువారం హైదరాబాద్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ను మర్యాద...
