ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పక్రియ
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
By Ram Reddy
On
(ఖమ్మం :లోకల్ గైడ్)
పోలింగ్ సరళి, పోలీస్ బందోబస్త్ పరిశీంచిన పోలీస్ కమిషనర్
మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఎన్నికల నేపథ్యంలో పలు పోలింగ్ స్టేషన్లను పోలీస్ కమిషనర్ సందర్శించారు. పోలీస్ బందోబస్త్ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, రామానుజం, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తో పోలింగ్ పక్రియ, బందోబస్త్ ఏర్పాట్లపై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు
అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శాంతియుత
వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.
Tags:
About The Author
Latest News
22 Feb 2026 23:54:23
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్
మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
