పండగలా పబ్లిక్ ఎగ్జామ్స్-త్రివేణి డైరెక్టర్ వీరేంద్ర చౌదరి
త్రివేణి విద్యార్థులకు డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి శుభాకాంక్షలు
ఖమ్మం( లోకల్ గైడ్)
ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్న పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న త్రివేణి విద్యార్థులకు డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి శుభాకాంక్షలు తెలియజేస్తూ పరీక్షలలో చక్కని ప్రతిభ కనబరిచి,ఇంతకాలం పాఠశాలలో నేర్చుకున్న మరియు అనేక పరీక్షలు రాసిన అనుభవంతో చక్కగా రాయాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని తన సందేశం ద్వారా తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ త్రివేణి ఖమ్మం విద్యార్థులు గత 22 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ర్యాంకులు సాధించి అత్యుత్తమ సంస్థగా నిలబడిందని ఈ సంవత్సరం విద్యార్థులు కూడా అదే పేరును కొనసాగించాలని మళ్లీ త్రివేణి కి మంచిర్యాంకు ఇవ్వాలని ఆకాంక్షించారు. పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థులు మరియు ఇంతకాలం పరీక్షల కోసం వారిని సిద్ధం చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఇంచార్జ్ దగ్గరుండి వారికి మనోధైర్యాన్ని చెబుతూ చక్కగా రాసి మంచి ఉత్తీర్ణతతో, మంచి మార్కులు,మంచి ర్యాంకు సాధించి తద్వారా వారి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ముస్తఫా స్వప్న క్యాంపస్ ఇంచార్జ్ చార్లెస్ ట్రాన్స్పోర్ట్ ఇంచార్జ్ సందీప్ పదవ తరగతి ఇంచార్జ్ శ్రీధర్ మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు
