విద్యుత్తు షాక్ తో యువ రైతుమృతి  

పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం

విద్యుత్తు షాక్ తో యువ రైతుమృతి  

మాగనూర్ మార్చి 7:
 మాగనూరు మండల కేంద్రానికి చెందిన యువరైతు బచ్చి దేవప్ప శనివారం కరెంట్ షాక్ తో మృతి చెందాడు.దాంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.తన వ్యవసా య పొలం దగ్గర ప్రమాద వశాత్తు కరెంటు షాకుకు గురై మరణించాడు.దేవప్ప కుటుం బాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం నారాయణ పేటజిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ , జిల్లా నాయకులు పుంజనూరు ఆంజనేయులు, భరత్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.దేవప్ప అతి నిరుపేద రైతు రెక్కడీతే కానీ పూట గడవని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.,ఆయన పిల్లలకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలో ఉచిత విద్యా అందించాలని, మృతుని కుటుంబానికి తక్షణమే ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు.
ఫోటో రైట్ అప్:మృతి చెందిన రైతు దేవప్ప
______________________

Tags:

About The Author

Latest News