కృష్ణ స్కూల్ లోఘనంగా స్వయం పరిపాలన
ఘనంగా స్వయం పరిపాల దినోత్సవం నిర్వహించారు.
నారాయణపేట మార్చి 7:
కృష్ణ మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా స్వయం పరిపాల దినోత్సవం నిర్వహించారు.
విద్యార్థులు స్వయంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించే ఈ ప్రోగ్రాం లో కలెక్టర్ గా లక్ష్మి, డీఈవోగా అయేషా, హెడ్మాస్టర్ గా గాయత్రి, ఎంఈఓ గా నందిత వ్యవ హరించారు. ఉదయం నుండి రోజువారి పాఠశాల కార్యక్ర మంతో పాటు మధ్యాహ్నం నుండి సాంస్కృతి కార్యక్ర మాలు నిర్వహించి ఘనంగా స్వయం పరిపాలన దినోత్స వం జరుపుకున్నారు.
విద్యార్థులు ఉజ్వలమైన భవిష్యత్తును అందుకొని నిజమైన ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందజేయా లని పాఠశాల ప్రధానోపా ధ్యాయులుకిషోర్ కుమార్ తెలియజేశారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగరాజు, షాహిన్, గోపాల్, అర్చన, రేణుక, అనిల్, రఘు, రంగారావు, రేణుకా దేవి , లక్ష్మీదేవి, రఘు మరి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:8.స్వపరి పాలనలో పాల్గొన్న విద్యార్థులు
___________________
