రెడ్ వైన్ – మితంగా తాగితే ఆరోగ్యానికి......

రెడ్ వైన్ – మితంగా తాగితే ఆరోగ్యానికి......

లోక‌ల్ గైడ్:

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని సాధారణంగా చెబుతుంటారు. విపరీతంగా మద్యం తాగితే నిజంగానే శరీరానికి నష్టం కలుగుతుంది. అయితే మితిమేరకు, ప్రత్యేకంగా రెడ్ వైన్ తాగితే మాత్రం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

 గుండెకు మేలు

రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రెస్వెరెట్రాల్‌, ఆంథోసయనిన్స్‌, కాటెకిన్స్‌, ప్రోఆంథోసయనైడిన్స్ వంటి సమ్మేళనాలు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫలితంగా:

  • కణాలు ఆరోగ్యంగా ఉండి, చర్మానికి కాంతి వస్తుంది

  • మొటిమలు, మచ్చలు తగ్గి, యువతను నిలుపుతుంది

  • రక్తనాళాల నష్టం తగ్గి, కోలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి

  • రక్తనాళాల్లో క్లాట్స్ కరిగి, వాపులు తక్కువవుతాయి

  • బీపీ కంట్రోల్ అవుతుంది, హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది

 టైప్ 2 డయాబెటిస్‌కు మేలు

పరిశోధనల ప్రకారం, రెడ్ వైన్ తాగడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. దీని వల్ల:

  • బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి

  • టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనం

  • రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది, ముఖ్యంగా ప్రోస్టేట్, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్లను నివారించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు

మెదడుకు లాభాలు

రెడ్ వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు:

  • మెదడు కణాలను రక్షిస్తాయి

  • రక్తప్రసరణ మెరుగుపడి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది

  • మతిమరుపు సమస్యలు తగ్గుతాయి

  • పాలిఫినాల్స్ ప్రీబయోటిక్‌లా పని చేసి జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడతాయి

ఎంత మోతాదులో తాగాలి?

పరిశోధకుల సూచన ప్రకారం:

  • వారానికి రెండు సార్లు, ఒక్కోసారి 150 ml మించకుండా తాగాలి

  • మితిమీరితే నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని హెచ్చరిస్తున్నారు

Tags:

About The Author

Latest News

ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేస్తాం..కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని...
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వైయస్సార్ సేవలు మరువలేనివి.
కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి