త్వరలో విడుదల కానున్న కొత్త రూ.20 నోట్లు – ఆర్బీఐ ప్రకటన
By Ram Reddy
On

లోకల్ గైడ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక ప్రకటన చేసింది. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్లో భాగంగా త్వరలో కొత్త రూపాయల 20 నోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నోట్లపై ఇటీవల పదవీలోకి వచ్చిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉండనుంది.కొత్త రూ.20 నోట్ల డిజైన్ ప్రస్తుతం చలామణిలో ఉన్న మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ నోట్ల మాదిరిగానే ఉండనుంది. ఇక ఇప్పటివరకు కేంద్ర బ్యాంకు జారీ చేసిన అన్ని రూ.20 నోట్లు చట్టబద్ధంగానే చలామణిలో కొనసాగుతాయని ఆర్బీఐ ఓ అధికారిక నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆ గవర్నర్ సంతకంతో కొత్త కరెన్సీని జారీ చేయడం అనేది సాధారణ ప్రక్రియ అని RBI పేర్కొంది. ఇది ప్రస్తుత నోట్ల విలువకు గానీ, చలామణిలో ఉన్న కరెన్సీకి గానీ ఎలాంటి ప్రభావం చూపదని కూడా స్పష్టం చేసింది.
Tags:
About The Author

Latest News

17 Jul 2025 15:01:11
విద్యార్థులతో సహపంక్తి భోజనం.*లోకల్ గైడ్/ తాండూర్:* నాణ్యమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని పెద్దేముల్ తహసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ పేర్కొన్నారు.బుధవారం, మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి...