ఎమ్మెల్యేను కలిసిన అనంత నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్
మల్కాజిగిరి ఆగస్టు 10 (. లోకల్ గైడ్)
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ నగర్ డివిజన్కు చెందిన అనంత నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసారు.
అనంత నగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ ఓవర్ఫ్లో సమస్యతో పాటు, వినాయక్ నగర్ ఇండియన్ బజార్ (చైనా బజార్) సమీపంలోని డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్య పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో అనంత నగర్ కాలనీ అధ్యక్షులు మహేష్ కుమార్, ప్రమోద్ కుమార్, నరేష్, యాదగిరి, జయప్రకాష్, వినయ్ కుమార్, దేవేందర్, యూనస్, ఆకాష్, సుకేష్ , సురేష్, నవీన్, లక్ష్మణ్, దినేష్, నాగరాజు గౌడ్, సురేష్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తులసి, సురేష్, బాలకృష్ణ, సంపత్ యాదవ్, , శ్రీకాంత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
