పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం
డిజిటల్ మార్కెటింగ్, ఆర్థిక అక్షరాస్యతపై ఆగాహన సదస్సు నిర్వహించారు.
గద్వాల,లోకల్ గైడ్:
ఎంఎస్ ఎంఈ, డీఎఫ్ఓ
ఆధ్వర్యంలో బుధవారం గద్వాల అక్షయ గ్రాండ్ బంకెట్ హాల్ లో పీఎం విశ్వ కర్మ లబ్ధిదారులకు డిజిటల్ మార్కెటింగ్, ఆర్థిక అక్షరాస్యతపై ఆగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా జిఎం డిఐసి రామలింగేశ్వర గౌడ్ ఎమ్మెస్ ఎం ఇ స్కీమ్స్, ఇతర ప్రభుత్వ స్కీమ్స్ గురించి వివరించారు. సదస్సులో రామలింగేశ్వర గౌడ్, బీసీ వెల్ఫేర్ అధికారి అక్బర్ భాష , సజ్జన్ సీనియర్ మేనేజర్ ఇండియా పోస్ట్ పేమెంట్, బ్యాంక్ ఎల్డీఎం శ్రీనివాస్ రావు, నుసిత, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్, శ్రీనివాస్ అడిషనల్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్, డి ఎం శ్రీనివాస్ నాయక్ ఆర్ సి టి, గురుస్వామి, రాజేశ్ యాదవ్ అసిస్టెంట్ డైరెక్టర్ లు ఎమ్మెస్ ఎం ఇ డీఎఫ్ఓ,హైద్రాబాద్, ఆనిమి రెడ్డి, పీఎం విశ్వ కర్మ మేనేజర్,వినీత్ పీఎం వి కన్సల్టెంట్, దయాకర్ ఈ డి సి మేనేజర్, శ్యామల ఈ డి సి అసిస్టెంట్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
