న్యాయవాదుల పరిరక్షణ చట్టం పట్ల బార్ అసోసి యేషన్ హర్షం

న్యాయవాదుల పరిరక్షణ చట్టం పట్ల బార్ అసోసి యేషన్ హర్షం

నారాయణపేట ఏప్రిల్ 1 :

న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావడం పట్ల నారాయణపేట బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం  జిల్లా కోర్టు ఆవరణలో హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్, ఉపాధ్యక్షుడు నందు నామాజీ, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి మాట్లాడుతు
గత కొన్నేళ్లుగా న్యాయవాదులు న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక,గుజరాత్ రాష్ట్రాల్లో అమలవుతున్న అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆక్ట్ మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఒక మంచి సంకల్పంతో  ఆదివారం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు  ద్వారా అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడం  బిల్లును చట్టముగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈబిల్లు వలన కేవలం అడ్వకేట్ మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు రక్షణ ఆస్తుల పరిరక్షణ కూడా కల్పిస్తూ చట్టం రూపకల్పన చేయడం యావత్ తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్స్ ప్రయోజనం కలుగనుందని అన్నారు.చట్టం తీసుకురావడానికి సహకరించిన ముఖ్యమంత్రి,మంత్రులు,అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులుపాల్గొన్నారు.ఫోటో రైట్ అప్:1.స్వీట్లు పంచుకున్న న్యాయవాదులు
________________________

Tags:

About The Author

Latest News

ఏప్రిల్ 11న  మహాత్మా జ్యోతిబా పూలే  జయంతోత్సవం కు ఏప్రిల్ 11న  మహాత్మా జ్యోతిబా పూలే  జయంతోత్సవం కు
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి 
ప్రజల భద్రత కొరకే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్...
హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్యుల రికార్డు  - 346 కిడ్నీ మార్పిడి చికిత్సలతో రికార్డు సృష్టించిన ఆసుపత్రి వైద్యులు 
సమ్మె చేస్తున్న ఆర్టిసన్స్ ను చర్చలకు పిలవాలి.
ఉన్నత విద్య నేటి తరాలకు అందించవలసిన అవసరం అధ్యాపకులపై ఉన్నది.
పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు – ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్