ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి 

అడిషనల్ కలెక్టర్ పాండు

ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి 

 

 

లోకల్ గైడ్ /సంగారెడ్డి :

 సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ట్రాన్స్‌జెండర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని అడిషనల్ కలెక్టర్ పాండు సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి వర్గానికి సమానంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు.
ట్రాన్స్‌జెండర్ సమాజం ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అవసరమైన పరీక్షలు, చికిత్సలు అందించేందు కు ఇలాంటి ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ఎంతో అవసర మన్నారు.  ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, డాక్టర్ శశాంక్, వైద్యులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఏప్రిల్ 11న  మహాత్మా జ్యోతిబా పూలే  జయంతోత్సవం కు ఏప్రిల్ 11న  మహాత్మా జ్యోతిబా పూలే  జయంతోత్సవం కు
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి 
ప్రజల భద్రత కొరకే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్...
హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్యుల రికార్డు  - 346 కిడ్నీ మార్పిడి చికిత్సలతో రికార్డు సృష్టించిన ఆసుపత్రి వైద్యులు 
సమ్మె చేస్తున్న ఆర్టిసన్స్ ను చర్చలకు పిలవాలి.
ఉన్నత విద్య నేటి తరాలకు అందించవలసిన అవసరం అధ్యాపకులపై ఉన్నది.
పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు – ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్