ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిబా పూలే జయంతోత్సవం కు
అందరూ ఆహ్వానితులే
By Ram Reddy
On
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
లోకల్ గైడ్/ సంగారెడ్డి :
మహాత్మ జ్యోతిబా పూలే 200 వ జయంతి సందర్భంగా ఈనెల 11న,శనివారం ఉదయం 9.00 గంటలకు ఆర్ & బి కార్యాలయం ప్రక్కన గల జ్యోతిబా పూలే విగ్రహానికి పుష్పమాలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం నాడు తెలిపారు.అనంతరం, వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని నటరాజ్ థియేటర్ పక్కన, కల్వకుంట రోడ్ లో బహిరంగ సభ నిర్వహించ నున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి ప్రజాప్రతి నిధులు, అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, బడుగు బలహీన వర్గాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
Tags:
