ప్రజల భద్రత కొరకే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్...

ప్రజల భద్రత కొరకే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్...

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

ప్రజల భద్రత కొరకే పోలీస్ శాఖ నిరంతరం పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని జైపూర్ సిఐ నవీన్ అన్నారు.మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట గ్రామంలో గురువారం కమ్యూనిటీ కాంటాక్ట్,సైబర్ నేరాల  అవగాహనతో పాటు వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ ఆస్తి సంబంధిత నేరాలు,రోడ్డు ప్రమాదాలు,సైబర్ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.ముఖ్యంగా అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ట్రాఫిక్ నియమాలు పాటించడం,ఆన్‌లైన్ లావాదేవీలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించగా సరైన పత్రాలు లేని 66ద్విచక్ర వాహనాలు,3ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.వాహనదారులు తప్పనిసరిగా దృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని,లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని,పోలీసులకు సహకరించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఏప్రిల్ 11న  మహాత్మా జ్యోతిబా పూలే  జయంతోత్సవం కు ఏప్రిల్ 11న  మహాత్మా జ్యోతిబా పూలే  జయంతోత్సవం కు
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి 
ప్రజల భద్రత కొరకే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్...
హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్యుల రికార్డు  - 346 కిడ్నీ మార్పిడి చికిత్సలతో రికార్డు సృష్టించిన ఆసుపత్రి వైద్యులు 
సమ్మె చేస్తున్న ఆర్టిసన్స్ ను చర్చలకు పిలవాలి.
ఉన్నత విద్య నేటి తరాలకు అందించవలసిన అవసరం అధ్యాపకులపై ఉన్నది.
పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు – ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్