శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ మసీద్ బండ కార్యాలయంలో హోలీ సంబరాలను. ఈ కార్యక్రమంలో మియాపూర్, హఫీజ్పేట్ డివిజన్ల నాయకులు, మసీద్ బండ గ్రామ మహిళలు, జిహెచ్ఎంసి కార్మికులు పాల్గొని రంగులు చల్లి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ..వసంత ఋతువుకు స్వాగతం పలికే రంగుల పండుగే హోలీ అని తెలిపారు. చెడుపై మంచికి సంకేతంగా నిలిచే ఈ పండుగ సమతా, మమతలకు ప్రతీకమని అన్నారు. పేద-పెద్ద తారతమ్యాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఆనందాలు పంచుకునే పండుగ హోలీ అని పేర్కొన్నారు. ఈ హోలీ పండుగ తెలంగాణ రాష్ట్రం, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరి జీవితాలlo సుఖశాంతులు, ఐశ్వర్యం, సంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రమణయ్య, సత్యనారాయణ రాజు, గుండె గణేష్ ముదిరాజ్, విష్ణుదత్, రాజు ముదిరాజ్, దేవేందర్ రావు, శ్రీను, శ్రీనివాస్ యాదవ్, రాము, అమర్నాథ్ రెడ్డి, కమలేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.