చలివేంద్రం ప్రారంభించిన సారపాక సర్పంచ్ ఉపసర్పంచ్
వార్డు సభ్యులు నవ్యశ్రీ, సావిత్రిలకు అభినందనలు తెలిపిన సర్పంచ్ ఉపసర్పంచ్
భద్రాద్రి జిల్లా, బూర్గంపాడు : లోకల్ గైడ్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలమ్మ గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్, ఉపసర్పంచ్ కన్నెదారి రమేష్ ఆదివారం ప్రారంభించారు. సారపాక గ్రామపంచాయతీ 13వ వార్డు సభ్యురాలు పోతిరెడ్డి నవ్యశ్రీ, 14వ వార్డు సభ్యురాలు కొమరం సావిత్రి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముందు ముత్యాలమ్మ గుడిలో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి, అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్ రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని భక్తులు, ప్రయాణికులు, వివిధ పనుల కోసం వచ్చి వెళ్లే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ముందుకు వచ్చిన పోతిరెడ్డి నవ్యశ్రీ, కొమరం సావిత్రిలను అభినందించారు. ప్రజల కోసం స్వచ్ఛందంగా మంచి కార్యక్రమాలు చేపడుతున్న తమ పాలకవర్గ సభ్యులను ప్రోత్సహిస్తామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కన్నెదారి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి, ఎన్హెచ్ఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దామెర ఆదినారాయణ, లాగిన్ నెట్ సెంటర్ అధినేత పోతిరెడ్డి అశోక్ రెడ్డి, స్థానికులు గుంజు రమేష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
