సింగరేణి మండలం సర్పంచ్ లా ఫోరం అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవం 

ప్రెసిడెంట్ భూక్యా రంజిత్ కుమార్  -వైస్ ప్రెసిడెంట్ వీసాం మోతి వీరస్వామి 

సింగరేణి మండలం సర్పంచ్ లా ఫోరం అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవం 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 15 :

సింగరేణి మండలం ఉసిరికాయపల్లి శ్రీ కోట మైసమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచుల ఫోరం అధ్యక్ష , ఉపాధ్యక్షులు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో గాదెపాడు సర్పంచ్ భూక్య రంజిత్ కుమార్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమితులు అవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షుడిగా రేగుల గూడెం సర్పంచ్ వీసాం మోతి వీరస్వామి నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సింగరేణి మండలంలో మొత్తం 41 గ్రామ పంచాయతీలకు, గ్రామపంచాయతీలో సంబంధించిన 39 మంది సర్పంచ్లు  వైరా  నియోజకవర్గ శాసనసభ్యులు   మాలోత్ రాందాస్ నాయక్  నాయకత్వంలో  వారి  సూచనల మేరకు  ఈ  కమిటీని ఎన్నుకోవడం  జరిగింది.  ఈ యొక్క కార్యక్రమంలో  ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు , కారేపల్లి మాజీ దేవస్థాన చైర్మన్ అడ్డగోడ  ఐలయ్య  పాల్గొని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఉపాధ్యక్షులు,  మిగతా కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి , శాలువతో ఘనంగా సత్కారించి  అభినందించడం జరిగింది.

Tags:

About The Author

Latest News

పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
సిద్ధిపేట జిల్లా ప్రతినిధి మార్చి15(లోకల్ గైడ్ తెలంగాణ)  ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని మైత్రి వనంలో గల వెనుకబడిన అభివృద్ధి శాఖ మరియు షెడ్యూల్ కులాల అభివృద్ధి...
సింగరేణి మండలం సర్పంచ్ లా ఫోరం అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవం 
శిక్షణ ను సద్వినియోగం చేసుకొని జనగణన పకడ్బందీగా
మెట్ల దారిన.. మొక్కుల దేవుని చెంతకు! శ్రీనివాసగిరిపై భక్తి పారవశ్యం.. భక్తులతో కలిసి నడిచిన మంత్రి పొంగులేటి
యరసానిగూడెం గ్రామంలో ఉచిత చెవి–ముక్కు–గొంతు వైద్య శిబిరం.
ఘనంగా గంగమ్మ ఆలయ తృతీయ వార్షికోత్సవం.
చలివేంద్రం ప్రారంభించిన సారపాక సర్పంచ్ ఉపసర్పంచ్