మీసేవ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ ఆగ్రహం

మీసేవ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ ఆగ్రహం

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ) 

ఏప్రిల్ 2:సిద్దిపేటలో మీసేవ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, నేతలు కోలా రమేష్ గౌడ్, మోహిజ్ మాట్లాడుతూ ఈ పెంపు సామాన్య ప్రజలపై అదనపు భారం మోపుతోందని అన్నారు.సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రజా పాలన పేరుతో దోపిడీ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ఛార్జీలు పెంచడం సరైంది కాదని అన్నారు.పెంచిన మీసేవ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, ఆపరేటర్లకు స్థిర వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News