కేజీబీవీలో భోజన నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం.
మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు.
By Ram Reddy
On
సిద్ధిపేట జిల్లా బ్యూరో (లోకల్ గైడ్ తెలంగాణ)
మెను పాటించినప్పటికీ వంట నాణ్యతగా చేయకపోవడంపై ఎస్ఓపై చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఫోన్ ద్వారా ఆదేశించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి చదువుల గురించి ఆరా తీశారు. గణిత సబ్జెక్ట్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.
గణితాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని, అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యాలయంలో భోజనం, ఆరోగ్యం, వసతి, చదువు విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Tags:
About The Author
Latest News
14 Mar 2026 20:52:17
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
