మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ అధికారుల బృందం తో కలెక్టర్ భేటీ

హైదరాబాద్  నుంచి వచ్చిన అధికారులతో శనివా రం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నా యక్ భేటీ అయ్యారు.  

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ అధికారుల బృందం తో కలెక్టర్ భేటీ

నారాయణపేట జనవరి 31:

ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ  శిక్షణ కేంద్రం, హైదరాబాద్  నుంచి వచ్చిన అధికారులతో శనివా రం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నా యక్ భేటీ అయ్యారు.  ఆ అధికారుల కోసం 8వ ఫౌండే షన్ కోర్సు లో భాగంగా  ఈ నెల  నుంచి  31 వరకు   విలే జ్ విజిట్  కార్యక్రమం నిర్వ హించారు. వారం రోజుల  పాటు అధికారులు 4 బృందా లుగా ఏర్పడి జిల్లాలో  ఎంపిక చేసిన నాగిరెడ్డి పల్లి( మద్దూ రు),సింగారం ( నారాయణ పేట మండలం) మరికల్, ఉట్కూర్, దామర గిద్ద మండల కేంద్రాలతో పాటు నారాయణ పేట మున్సి పాలిటీ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై సోషల్ ఎకనామిక్ అండ్ డెవలప్ మెంట్ స్కీమ్ సర్వే నిర్వహిం చారు. శనివారం జిల్లా కలెక్ట రేట్ లోని సమావేశ మంది రంలో ఆ అధికారుల బృందం తో కలెక్టర్ భేటీ అయి, సర్వే ఎలా సాగిందని అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా ఆయా బృందాల ముఖ్యులు తాము వారం రోజుల పాటు గ్రామాల్లో చేసిన సర్వే నివేదిక ను కలెక్టర్ కు అందజేశారు.
ఫోటో రైట్ అప్:3.మిలిటరీ ఇంజనీర్ అధికారులతో భేటీ అయిన కలెక్టర్
______________________

Tags:

About The Author

Latest News