ప్రభుత్వంపై తిరుగబడే రోజులు వస్తాయి.
కిష్ట్యా నాయక్
నారాయణపేట జనవరి 31:
కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపా లన చేతకాక ప్రజల్లో పెరుగు తున్న వ్యతిరేకతను పక్కదా రి పట్టించడానికి సిట్ పేరుతో కేసీఆర్ కు నోటీసులు భారాస యువ నాయకులు కిష్ట్యా నాయక్ తీవ్రంగా ఒక ప్రకటనలో ఖండించారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి దశాబ్ధ కాలంపాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని అన్నారు. అలాంటి నాయకు డికి నోటీసులు ఇవ్వడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. చరిత్రాత్మకమైన నాయకుడిపై బురదజల్లాలని ప్రయత్నించడం సూర్యుడిపై ఉమ్మి వేయడమే అని పేర్కొన్నారు. పరిపాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించ డానికి ఈ నోటీసులు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులను వేధిస్తే ప్రజలు ప్రభుత్వంపై తిరుగబడే రోజు లు వస్తాయని రేవంత్ ప్రభు త్వాన్ని హెచ్చరించారు.
ఫోటో రైట్ అప్:9.కిస్త్యానాయక్
_______________________
