రబీ రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి సిపిఎం డిమాండ్
రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహిం చారు.
నారాయణపేట ఫిబ్రవరి 25:
మాగనూరు మండల కేంద్రంలో బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులకు రబీ రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహిం చారు.ఈ సందర్బంగా
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి వెంకటరామిరెడ్డి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం రబి రైతు భరోసా పెట్టుబడి సాయం సాగుకాలం గడుస్తున్న సాయం అంద కపోతే రైతు ఎలా బత కాలి అనీ ప్రశ్నించారు.అన్నదాత ఆకలి కేకలు వినబడడం లేదా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉందనీ అన్నారు. తక్షణమే రబీ రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్య క్రమంలో సిపిఎం పార్టీ మక్తల్ ఏరియా కార్యదర్శి పుంజ నూర్ ఆంజనేయులు ,భరత్ కుమార్ మంగలి అశోక్ పుంజనూరు మహాదేవ్ బొల్ల దేవప్ప గడ్డమీది నరసప్ప కొత్తపల్లి శంకరప్ప వడ్డే మారెప్ప ఎలిగండ్ల నర్సింలు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులు
_____________________
