వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ

రూ.53.80 లక్షల విలువైన యంత్రాలు అందజేసిన:మంత్రి

వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ

IMG-20260311-WA0057
సిద్దిపేట జిల్లా ప్రతినిధి నరేష్ (లోకల్ గైడ్ తెలంగాణ) 

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈనెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని, ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
బుధవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రికీకరణ పథకం కింద అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాలకు చెందిన 38 మంది రైతులకు రూ.53 లక్షల 80 వేల విలువైన వ్యవసాయ పరికరాలను మంత్రివర్యులు పంపిణీ చేశారు. ఇందులో 36 రోటోవేటర్లు, 2 స్ట్రాబెలర్లు (గడ్డిని కట్టకట్టే యంత్రాలు) రైతులకు 50 శాతం సబ్సిడీపై అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల శ్రమను తగ్గించి అధిక దిగుబడులు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రికీకరణ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. రైతులు ఈ పథకాన్ని వినియోగించుకుని ఆధునిక వ్యవసాయ పరికరాలను పొందాలని సూచించారు.
ఈనెల 22న నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా మూడు రోజుల పాటు రైతు మేళా నిర్వహించి వ్యవసాయ పనిముట్ల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.ఇంకా రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్ల నేపథ్యంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించనున్నట్లు తెలిపారు. గతంలో రైతులకు అందని చిన్న చిన్న వ్యవసాయ పరికరాలను ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ కింద మరిన్ని వ్యవసాయ పరికరాలను అందించే అవకాశం ఉందని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు రైతులను వ్యవసాయ యాంత్రికీకరణ పథకం ద్వారా పరికరాలు పొందేందుకు ప్రోత్సహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయబడినది.

Tags:

About The Author

Latest News

మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేట్ వారి ఆధ్వర్యంలో మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు. మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేట్ వారి ఆధ్వర్యంలో మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మార్చి 11. (లోకల్ గైడ్)  హైదరాబాద్లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కిక్కర్స్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ  ఆదేశాలు అఖిలభారత
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత...
పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలి.
వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ
శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో మాతా పురస్కార్ అవార్డ్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానం చేశారు.