ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రతపై దృష్టి
సిద్దిపేటలో ట్రాఫిక్ పోలీసుల ప్రచారం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి26: గురువారం సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపట్టిన “అరైవ్-అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమం భాగంగా ఈరోజు సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ గోపాల్ రెడ్డి, ఎస్.ఐ ఉమేష్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొని వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ,ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్ఐ ముద్ర కలిగిన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. “వేగం కన్నా ప్రాణం మిన్న” అని హెచ్చరిస్తూ, అధిక వేగంతో వాహనాలు నడపవద్దని సూచించారు. రాంగ్ రూటు డ్రైవింగ్,సిగ్నల్ జంపింగ్ వల్ల జరిగే ప్రమాదాలను వివరించ్చారు, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు.రోడ్డు భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాద రహిత సిద్దిపేట సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.
