ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ , మార్చి 8 :
కారేపల్లి మండలం గేట్ కారేపల్లి గ్రామ పంచాయతీ లో మహిళ దినోత్సవ సందర్బంగా వేడుకలను సర్పంచ్ పూసం ఎల్లయ్య, పంచాయతీ సెక్రటరీ కె. అనూష అధ్యక్షతన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ ఎల్లయ్య మాట్లాడుతూ మహిళలు అన్నీ రంగాల్లో ముందు ఉండాలని, మహిళ సరదాకతే మానవళి మనుగడకు ముఖ్యమని స్త్రీ లేనిదే మానవ జన్మకు ఆధారం లేదని స్త్రీలను గర్వించుకోవాలని హితావు పలికినాడు.ఈ సందర్బంగా గేట్ కారేపల్లి గ్రామ సెక్రటరీ కె.అనూష గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులైన మహిళలను, అంగన్వాడీ టీచర్స్, సిబ్బంది నీ, గ్రామ మహిళలను మహిళ దినోత్సవం సందర్బంగా తన సంతోషర్ధం మహిళలను ఘనంగా సన్మానించుకోని, అందరి సమక్షంలో కేక్ కట్ చేసుకొని సంతోషం తో వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ భూక్యా కల్పన కిరణ్ కుమార్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయినేని తిరుపతి రావు , గుడిపూడి తిరుమల్ రావు , చెరుకూరి వెంకటయ్య , సాయిన్ని నర్సింహారావు , ఎ ఎన్ ఎం మల్లీశ్వరి, అంగన్వాడీ టీచర్స్ ఇ. కుమారి, ఎస్. నాగమణి, బి. లక్ష్మి , సిబ్బంది నందిని, మైముదా , ఆశవర్కర్ పి. ఉమా , గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.