అంతర్జాతీయ పార్లమెంటరీ గ్రూప్‌లో ఖమ్మం ఎంపీకి చోటు

భారత్–స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యుడిగా రఘురాం రెడ్డి

అంతర్జాతీయ పార్లమెంటరీ గ్రూప్‌లో ఖమ్మం ఎంపీకి చోటు


 ఖమ్మం:( లోకల్ గైడ్)

  పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డికి అంతర్జాతీయ పార్లమెంటరీ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్–స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యుడిగా ఆయనను లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేశారు. ప్రస్తుత 18వ లోక్‌సభ కాలానికి సంబంధించి భారత్ మరియు స్విట్జర్లాండ్ దేశాల మధ్య పార్లమెంటరీ స్నేహ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది.
ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ నుంచి ఎంపీ రఘురాం రెడ్డికి అధికారికంగా సమాచారం పంపించారు. ఈ గ్రూప్ ద్వారా రెండు దేశాల పార్లమెంటరీ సభ్యుల మధ్య పరస్పర సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
కీలక బాధ్యత పట్ల పలువురి హర్షం..
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డికి ఈ అంతర్జాతీయ పార్లమెంటరీ గ్రూప్‌లో సభ్యత్వం లభించడం పట్ల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Latest News

అంతర్జాతీయ పార్లమెంటరీ గ్రూప్‌లో ఖమ్మం ఎంపీకి చోటు అంతర్జాతీయ పార్లమెంటరీ గ్రూప్‌లో ఖమ్మం ఎంపీకి చోటు
  ఖమ్మం:( లోకల్ గైడ్)   పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డికి అంతర్జాతీయ పార్లమెంటరీ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్–స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యుడిగా
మాదారం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం 
ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం
మున్సిపాలిటీ కో-ఆప్షన్ రేసులో బండారు మహేష్?
అశ్వారావుపేటలో ప్రతిపక్షం అడ్రస్ గల్లంతు?
నూతన వధువరులకు శుభాకాంక్షలు 
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి..