అంతర్జాతీయ శ్రామిక మహిళ దినోత్సవాన్ని
పితృ స్వామిక సమాజంలో పురుష అహంకార ధోరణలు వెంటాడుతున్నాయి.
By Ram Reddy
On
ఇక సిట్ భారత్ జి రామ్ జి పథకాన్ని రద్దు చేయాలి. -శ్రామిక మహిళ హక్కుల సాధనకై ఉద్యమిద్ధాం శారు కవిత
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 5 :
గత ఎండ్ల తరబడి పోరాడి సాధించుకున్న హక్కుల చట్టాలను వీరి వీరియం చేస్తూ మరోపక్క హక్కుల కోసం న్యాయం కోసం పోరాడే శక్తులను ఉక్కు పాదంతో అణిచివేస్తుంది. భారత గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు జాతీయ గ్రామీణ హామీ పథకంలో గణనీయంగా పాల్గొంటున్నారు`` ఏడి నీళ్లకు చన్నీళ్లు తోడైనట్లు `` ఈ ఉపాధి హామీ పథకం ఆర్థికంగా ఉపయోగపడేది ఉపాధి హామీ ఒక హక్కుగా ఉండేది ప్రభుత్వం జవాబు దారిగా ఉండేది కానీ దీనిని స్థానంలో `` వికాసిత్ భారత్ జి రామ్ జి,, అనే పదాన్ని తీసుకొచ్చారు 2025 ఇది దేశ చర్చని అంశంగా మారింది.
1991 నూతన ఆర్థిక విధానాలతో అసమానతలు ఇరపడ్డాయి ఉద్యమించారు, దానిని ఫలితంగా జాతీయ ఉపాధి హామీ చట్టంతో పాటు సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, అటవీ హక్కుల చట్టం లాంటి చట్టాలు వచ్చాయి వి అన్నిటిని రద్దు చేయకుండానే వాటిని లోపాల్నించి డొల్లగా మార్చడానికి అంటే`` కరి మింగిన వెల గ పండూలా'' ఉండే మాదిరిగా చట్టాన్ని నిర్వీర్యం కాబోతున్నాయి. అప్పులు లేని ప్రభుత్వ ఆధారిత చట్టాలుగా మారబోతున్నాయి కార్మిక లోకం ఏళ్ళ తరబడి పోరాడి సాధించుకుంటున్న 44 చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్స్ ను నిరంకుశంగా అమలులోకి తెచ్చారు కార్మికులు అంతా ఆధునిక బానిసలుగా మారబోతున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం ప్రతి8 నిమిషాలకు ఒక బాలిక అత్యాచారాలకు గురి అవుతుంది . భారతదేశంలో సెన్స్ వ్యాపారం చిన్న పిల్లలు అక్రమ రవాణా గురించి అత్యున్నత సుప్రీం కోర్ట్ కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది దీనిని బట్టి మన వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు చారిత్రిక పోరాటాల ద్వారా నిర్మితమైన మొత్తం సమాజాన్ని నాగరికతను సక్రమంగా నూతన మార్గంలో వెనక్కి మళ్ళించే విశృత రాజకీయ ఆర్థిక సాంఘిక సంస్కృతిక ప్రాజెక్టును అమలు జరుగు తోంది. సమాజంలో సగం ఆకాశంలో సగం గా ఉన్న మహిళ సమాజాన్ని మనువాద ` కు హారం ' బంధించడానికి కుట్ర పన్నుతుంది అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పీ వో డబ్ల్యూ రాష్ట్ర నాయకులు భాగ్య లక్ష్మి, రాణి, వార్డు నెంబర్ నాగమణి, లక్ష్మి, గ్రామ శాఖ కార్యదర్శి సక్కుబాయి, పాయం బోయమ్మ, సుహాసిని, మంజుల, రమణ, రజిత, వసంత, లక్ష్మి, ఆర్యం పొట్టెమ్మ, సీ పీ ఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ కారేపల్లి, కామేపల్లి సబ్ డివిజన్ కార్యదర్శి ముఖ్య శివ నాయక్ గ్రామ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
17 Mar 2026 18:21:52
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
