సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు
By Ram Reddy
On
దుమ్ముగూడెం : లోకల్ గైడ్ :
దుమ్ముగూడెం మండలం పర్ణశాల రైతు వేదికలో మంగళవారం సహజ వ్యవసాయం పై ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ప్రారంభించి రైతులకు మార్గదర్శకత్వం అందించారు.
శిక్షణలో భాగంగా సహజ వ్యవసాయం పద్ధతులు, వాటి ప్రాముఖ్యత, ఖర్చు తగ్గింపు విధానాలు, నేల ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై అధికారులు రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు తగ్గించి సహజ వనరులను వినియోగించడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న రైతులకు అవసరమైన వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. రైతులు సహజ వ్యవసాయాన్ని ఆచరణలో పెట్టి స్థిరమైన వ్యవసాయ విధానాల వైపు ముందడుగు వేయాలని బాబురావు సూచించారు.
Tags:
About The Author
Latest News
17 Mar 2026 18:21:52
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
