హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ) 

మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ మరియు సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి, రైతులు పండించిన మొక్కజొన్న అమ్మకానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. దీనిపై వెంటనే స్పందించిన తుమ్మల నాగేశ్వరరావు, హుస్నాబాద్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, బొలిశెట్టి శివయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యవసాయ మరియు మార్క్‌ఫెడ్ అధికారులు పాల్గొన్నారు.
అదేవిధంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా మరియు రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే పూర్తి స్థాయిలో మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.