ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులను వేగవంతం చేయాలి… నిర్లక్ష్యానికి తావు ఉండదు. ---మేయర్
ఉడెఫ్ , ఎం జి ఎఫ్ నిధులతో కొనసాగుతున్న పనులపై మేయర్ సమీక్ష
By Ram Reddy
On
ఖమ్మం,:లోకల్ గైడ్ :
నగరంలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ పనుల పురోగతిని మేయర్ విడమరచి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని, పనులలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
ప్రతి పనిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
అభివృద్ధి పనులు సమయానికి పూర్తయితేనే ప్రజలకు నిజమైన ప్రయోజనం చేకూరుతుందని మేయర్ పేర్కొన్నారు.
అధికారులు సమన్వయంతో పని చేసి నగరాభివృద్ధికి తోడ్పడాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ఈ ఈ కృష్ణలాల్, డిఇలు ఏలు హాజరయ్యారు.
Tags:
About The Author
Latest News
09 Mar 2026 14:39:06
ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల డిమాండ్
